ఇండియా-ఏ జట్టులో రింకు సింగ్‌కు చోటు

Jan 23,2024 22:15 #Sports

ఇంగ్లండ్‌ లయన్స్‌తో నాలుగురోజుల మ్యాచ్‌

ముంబయి: ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగే రెండో నాలుగురోజుల మ్యాచ్‌లో ఇండియాాఏ కెప్టెన్‌గా రింకు సింగ్‌ ఎంపికయ్యాడు. ఈమేరకు బిసిసిఐ మంగళవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఉతప్ర్రదేశ్‌కు చెందిన ఎడమచేతివాటం బ్యాటర్‌ అయిన రింకు.. 44 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో 57.57 యావరేజ్‌తో 3,109 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా టి20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రింకు సింగ్‌ ఆ రెండు మ్యాచుల్లో 17, 38పరుగులు చేశాడు. బుధవారం నుంచి అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌ లయన్స్‌తో ఇండియాాఎ జట్టు రెండో నాలుగు రోజుల మ్యాచ్‌ను ఆడనుంది. జట్టు: అభిమన్యు ఈశ్వరన్‌, సాయి సుదర్శన్‌, రజత్‌ పటీధర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, తిలక్‌ వర్మ, కుషగ్ర, సుందర్‌, సౌరభ్‌ కుమార్‌, ఆర్ష్‌దీప్‌ సింగ్‌, తుషార్‌ దేశ్‌పాండే, కావేరప్ప, ఉపేంద్ర యాదవ్‌, ఆకాశ్‌ దీప్‌, యశ్‌ దయాల్‌, రింకు సింగ్‌.

➡️