తనిఖీలు చేస్తున్న అధికారులు
ప్రజాశక్తి-బొమ్మనహాల్
మండలంలోని ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక నుంచి ఆంధ్రాకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. కాగా వాహనాల తనిఖీ ఆలస్యం అవుతుండటంతో బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రయాణించి ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇన్ని తనిఖీలు చేస్తున్నా కర్ణాటక మద్యం జోరుగా ఆంధ్రాలోకి ప్రవేస్తున్నట్లు సమాచారం. ఈవిషయమై ఎస్ఐ శ్రీనివాసులు వివరణ కోరగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, కర్ణాటక మద్యం ఆంధ్రాలోకి రావడం అసాధ్యమన్నారు. అలాంటి వారిపై ప్రత్యేక నిణా ఏర్పాటు చేశామన్నారు.