ఒకే పార్లమెంట్‌ పరిధిలో వద్దు- ఉద్యోగుల బదిలీలపై ఇసి ఆదేశం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సాధారణ ఎన్నికల నేపథ్యంలో సొంత జిల్లాలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను జిల్లా బదిలీల పేరుతో అదే పార్లమెంటరీ పరిధిలో నియమించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు శనివారం ఇసి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పక్క జిల్లాల్లో అధికారులను బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తున్నట్లు కమిషన్‌ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే జరిగిన బదిలీలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది.

➡️