అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం.. బాలికపై లైంగికదాడి

  • ఎలాగూ చంపేస్తాంగా అని.. సామూహిక అత్యాచారం..
  • అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం

ప్రజాశక్తి-చింతపల్లి : బాలికపై లైంగికదాడి చేశాడు ఓ యువకుడు. తన నేరం బయటపడుతుందని భావించి స్నేహితుడితో కలిసి బాలికను చంపేద్దామని ఆమె ఇంటికి వెళ్లి.. ఎమరోసారి ఆమెపై లైంగికదాడి చేసి చంపేసిన ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడెంకొత్తవీధి మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ పాంగి రమేశ్‌(19) కన్నేశాడు. ఈ నెల 2న బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా.. ఇదే అదునుగా భావించిన అతడు ఆ బాలికను బలవంతంగా ఒక ఇంట్లోకి ఎత్తుకు వెళ్లి అత్యాచారం చేశాడు.. తీవ్ర రక్తస్రావంతో బయటకు వచ్చిన బాలిక తన ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. దీనిని గ్రహించిన అతడు తల్లిదండ్రులతో చెబుతుందనే భయంతో తన స్నేహితుడు గేమిలి సీతన్నకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు.. ఇద్దరు కలిసి బాలికను చంపేయలని నిర్ణయించుకుని బాలిక ఇంటికి వెళ్లారు. సీతన్న బయట కాపలా ఉండగా రమేష్‌ ఇంటిలోకి వెనకవైపు ఉన్న ద్వారం గుండా లోపలికి వెళ్ళాడు. అతని చూడగా నే బాలిక కత్తి తీసుకొని అతడిని ప్రతిఘటించింది దాంతో అతడు బాలిక గుండెపై బలంగా గుద్దాడు. ఆ దెబ్బకు బాలిక ఎముక ఒకటి విరిగిపోగా..గట్టిగా అరుస్తూ కింద పడిపోయింది.. ఆ అరుపు విని బయట ఉన్న సీతన్న లోపలికి వచ్చాడు. కిందపడి ఉన్న బాలికను చూసి ఎలాగూ చంపేస్తాము కదా అని మరల అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేసి పక్కనే ఉన్న చీరను తీసుకొని దూలానికి వేలాడదీసి ఆత్మహత్యల చిత్రీకరించేలా తనని దూలానికి వేలాడదీసి పరారయ్యారు. సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. మరుసటి రోజు అంత్యక్రియల్లో భాగంగా మృతురాలికి స్నానం చేయిస్తున్న సమయంలో శరీరంపై గాయాలు కనిపించాయి. తల్లిదండ్రులకు అనుమానం వచ్చినా మృతదేహాన్ని ఖననం చేశారు. ఈనెల 5న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. సీఐ అశోక్‌కుమార్‌ గ్రామానికి వెళ్లి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. ఖననం చేసిన మతదేహాన్ని రెవెన్యూ అధికారులు, వైద్యుల సమక్షంలో బయటకు తీయించి పోస్టుమార్టం పూర్తి చేశారు. ఇంతలో తమ పేర్లు బయటకు వస్తాయని భావించిన నిందితులిద్దరూ వీఆర్వో సాయంతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులపై పోక్సోతోపాటు లైంగికదాడి, హత్య కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ అప్పలసూరి పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️