అలుపెరుగని పోరాటంతోనే డిమాండ్ల సాధన

Jan 23,2024 22:07

కేక్‌ కట్‌ చేస్తున్న అంగన్వాడీలు, సిఐటియు నాయకులు

                    పుట్టపర్తి రూరల్‌ : అంగన్వాడీల 42 రోజుల అలుపెరిగిన పోరాటం వలన డిమాండ్ల సాధన సాధ్యమైందని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద పుట్టపర్తి ప్రాజెక్టు సంబంధించి విజయోత్సవ సభ నిర్వహించా రు. కేక్‌ కోసి సంబరాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌. వెంకటేష్‌ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఇంతియాజ్‌ మాట్లాడుతూ 42 రోజులు పాటు విరోచిత పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీ సమస్యలకు సానుకూలంగా స్పందించిందన్నారు. అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. సమ్మెలో పాల్గొని మద్దతు తెలియజేసిన కార్మిక, ప్రజా, మహిళా సామాజిక సంఘాలకు, వివిధ రాజకీయ పార్టీలకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బ్యాళ్లఅంజి, అంగన్వాడీ పుట్టపర్తి ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు సుజాత, నాగమణి, కోశాధికారి మంజుల, ప్రాజెక్ట్‌ లీడర్లు శ్రావణి, శ్రీదేవి, ఉష, షర్మిల తదితరులు పాల్గొన్నారు.

➡️