ముంబయి: టీమిండియా సీనియర్ ఫాస్ట్బౌలర్ మహ్మద్ షమి అర్జున అవార్డు రేసులో నిలిచాడు. ఐసిసి వన్డే ప్రపంచకప్లో షమి అద్భుతంగా బౌలింగ్ చేయడంతో అతడి పేరుని అర్జున అవార్డు కోసం సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ విషయంలో క్రీడా మంత్రిత్వ శాఖకు బిసిసిఐ ప్రత్యేక అభ్యర్థన చేసినట్లు తెలిసింది. క్రీడా మంత్రిత్వ శాఖకు తొలుత పంపిన జాబితాలో మహ్మద్ షమి పేరు లేదు. ప్రపంచకప్లో కేవలం ఏడు మ్యాచ్ల్లోనే 24 వికెట్లు పడగొట్టి లీగ్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. మూడు మ్యాచ్ల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన(7/57) న్యూజిలాండ్పై. ప్రపంచ కప్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న షమి.. ఇక ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న’ అవార్డుకు పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి పేర్లను సిఫారసు చేశారు.