అమ్మ కంటి హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం

ప్రజాశక్తి-చీరాల: చీరాల పట్టణంలోని మసీదు సెంటర్‌లో అమ్మ మల్టీ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి డాక్టర్‌ వరికూటి అమృతపాణి అధ్యక్షతన బుధవారం హాస్పటల్‌లో నూతనంగా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ క్యాబిన్‌ను చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, వైసిపి ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌ బాబు చేతుల మీదగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అమృతపాణి మాట్లాడారు. హాస్పిటల్‌ పెట్టినప్పటి నుంచి పేద ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఫ్రీగా కొన్ని వేల ఆపరేషన్లు చేశానన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబు, డాక్టర్‌ బాబురావు, రాష్ట్ర మహిళా జాయింట్‌ సెక్రెటరీ మల్లెల లలిత రాజశేఖర్‌, శిఖ సురేష్‌, చీమకుర్తి బాలకృష్ణ, సల్లూరి అనిల్‌, బత్తుల అనిల్‌, కంప అనిల్‌, కల్వకూరి యానాదిరావ్‌, షేక్‌ కబీర్‌, చిలుకోటి శ్రీనివాసరావు, షేక్‌ మొహమ్మద్‌, వాసిమల్ల బ్రదర్స్‌, అనిల్‌, జంగా ప్రేమ్‌ కుమార్‌, తలకాయల సుధీర్‌, గోసాల అశోక్‌ వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️