అన్యాయం: సిపిఎం

Jan 31,2024 21:55 #cpm v srinivasarao, #prakatana

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో రాష్ట్రంలో ప్రస్తుతం 20 వేలకు పైగా టీచర్‌ పోస్టులు ఖాళీ ఉంటే ప్రభుత్వం కేవలం 6,100 పోస్టులను మాత్రమే ఈ రోజు డిఎస్సీ ప్రకటించడం అన్యాయమని సిపిఎం విమర్శించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేశారు. గత అయిదేళ్లుగా డిఎస్సీ లేనందున మెగా డిఎస్సీ కోసం అయిదు లక్షల మంది ఆశావహులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుండగా, బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో కేవలం 6,100 పోస్టుల భర్తీకి మాత్రమే డిఎస్సీ ఇవ్వాలని నిర్ణయించడం వారిని తీవ్ర నిరాశపరుస్తుందని అన్నారు. మొత్తం ఖాళీలన్నిటిని భర్తీ చేసేలా డిఎస్సీ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

➡️