అచ్చంపేట: మహిళా సాధికారత కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. మండల పరిధిలోని మహిళ లకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలు బుధవారం అందజేశారు. మండల పరిధిలో మొత్తం 2400 మంది మహిళలకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్లస్థలాలతో పాటు ఇళ్లు నిర్మిం చుకునేందుకు కూడా ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో జెడ్పిటిసి తుమ్మ విజయ ప్రతాపరెడ్డి, ఎంపీపీ బి.రజిని, కృష్ణా నాయక్, నెల్లూరు చంద్రబాబు, చిలక చంద్రయ్య, సర్పంచ్ షేక్ జానీ, రంగయ్య మేకల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.