శ్రీ కేసు నమోదుప్రజాశక్తి-బైరెడ్డిపల్లి: అక్రమంగా బియ్యం తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. మండలంలోని లక్కనపల్లి వద్ద బుధవారం వాహనాల తనిఖీలు చేపట్టామన్నారు. కాగా అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన వివరించారు. 750కిలోల బియ్యం బస్తాలను సీజ్ చేశామన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో పోలీస్ సిబ్బంది, వీఆర్వో వెంకటేష్ పాల్గొన్నారు.