చెట్టు పైనుండి పడి యువకుడు మృతి

Dec 4,2023 17:25 #Anantapuram District
young man died by falldow from tree

ప్రజాశక్తి-అనంతపురం : చెట్టుకొమ్మను నరకడానికి వెళ్లి చెట్టు పైనుండి పడి దెబ్బతిని యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాయదుర్గంలో జరిగింది. పట్టణంలోని శాంతినగర్ లో నివసిస్తున్న సునీల్ (36 సంవత్సరాలు) ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. వాల్మీకి నగర్ ప్రాంతంలో చెట్టుకొమ్మ నరికేందుకు సోమవారం ఉదయం చెట్టును ఎక్కి కొమ్మను నరుకుతుండగా పైనుండి కింద పడ్డాడు. గాయపడిన అతడిని రాయదుర్గం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కై కర్నూలుకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మరణించాడు. సునీల్ కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాయదుర్గం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️