సమాజ సేవే ధ్యేయం 

Jan 15,2024 13:20 #Annamayya district
young india foundation services

ప్రజాశక్తి – బి.కొత్తకోట : సమాజ సేవే యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ ధ్యేయమని ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాజశేఖర్ పేర్కొన్నారు. సోమవారం యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ సభ్యులు సమావేశం జరిగింది. ఇందులో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థ ఆవిర్భావం నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా తుమ్మరకుంట నందు దుగ్గి నరేష్ గత 10సంవత్సరాల నుండి టైలరింగ్ చేస్తూ జీవనం చేస్తూ ఉండగా ప్రమాదంలో అతని బంకు, టైలరింగ్ మిసెన్స్, దాదాపుగా 1.5లక్షల బట్టలు కాలిపోయాయి. యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ గమనించి దుగ్గి నరేష్ కు కుట్టు మిసెన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ మునిరెడ్డి, సచివాలయం కన్వీనర్ తగాది శ్రీనివాసులు, యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ అధ్యక్షులు రాజశేఖర్ టీం సభ్యులు శ్రీనివాసులు, భాస్కర్, నరేష్, అశోక్, సతీష్, సూరి, చిన్నా , సుదర్శన్ పాల్గొన్నారు.

➡️