విలేకరిపై వైసిపి నాయకుడు దాడి

ప్రజాశక్తి-బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలోని ఓ రాజస్థాన్ టీ దుకాణం నందు ఆంధ్రప్రభ విలేకరి దగ్గుబాటి రంగస్వామిపై వైసిపికి చెందిన మూల నారాయణరెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా దాడి చేశారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఉదయం రాజస్థాన్ టీ కొట్టు నందు టీ తాగడానికి వచ్చిన మూల నారాయణరెడ్డి అనే వ్యక్తి విలేకరులందరినీ వర్ణించలేని పదజాలంతో దూషిస్తున్నప్పుడు అక్కడే ఉన్న ఆంధ్రప్రభ విలేకరి  దగ్గుపాటి రంగస్వామి ఆయన మాటలను ఖండించారు. ఆ విషయంపై ఆగ్రహించిన మూల నారాయణరెడ్డి అనే వ్యక్తి విలేకరి రంగస్వామిపై దాడికి దిగాడు. అతని దగ్గర ఉన్న ద్విచక్ర వాహన తాళంతో కన్ను దగ్గర పొడిచాడు. పొడిచిన దగ్గర సుమారు మూడు కుట్ల వరకు పడ్డాయి. అంతటితో ఆగకుండా బెదిరింపులులకు పాల్పడ్డాడు. పత్రికా స్వేచ్ఛకు ఇంతటి అవమానం జరగటం తాము ఎక్కడా చూడలేదని స్థానికులు నివ్వెరపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

➡️