ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఐదో జాబితాను వైసిపి విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఏడు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అరకు నుంచి రేగం మత్స్యలింగం, అవనిగడ్డకు సింహాద్రి చంద్రశేఖర్రావు, సత్యవేడుకు నూకతోటి రాజేష్ పేర్లను విడుదల చేసింది. అలాగే పార్లమెంటుకు సంబంధించి కాకినాడకు చలమశెట్టి సునీల్, మచిలీపట్నంకు సింహాద్రి రమేష్బాబు, నర్సారావుపేటకు పి అనిల్కుమార్ యాదవ్ను, తిరుపతికి మద్దిల గురుమూర్తిని ప్రకటించింది.