వడదెబ్బకు కార్మికుడు మృతి

Apr 22,2024 01:01 #death

ప్రజాశక్తి – వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ఎండవేడిమి, వేడి గాలులు తాళలేక ఓ కార్మికుడు మరణించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం వెదురుకుప్పం పంచాయతీ చిన్నమ్మరెడ్డి కండ్రిక దళితవాడకు చెందిన బొమ్మసముద్రం నాగరాజా (57) ఆదివారం ఉదయం కూలి పనులకు వెళ్లారు. ఎండకు తాళలేక పని ప్రదేశంలోని తీవ్ర అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన స్థానికులు పచ్చికాపల్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.

➡️