మహిళా చైతన్యం పెరిగింది

Mar 7,2024 23:07

ప్రజాశక్తి – బాపట్ల
సమాజంలో మహిళా చైతన్యం పెరిగిందని, స్వయంశక్తితో అన్ని రంగాల్లో పురుషులతో మహిళలు పోటీ పడుతున్నారని బాపట్ల ఆహార విజ్ఞాన కళాశాల ప్రొఫెసర్ జాగర్లమూడి లక్ష్మీ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం స్త్రీ శక్తి భవన్లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో స్వశక్తి – మహిళ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వివిధ రంగాల్లో వ్యాపార వేత్తలుగా మన్ననలందు కుంటున్న 16మంది మహిళా వ్యాపారవేత్తలను సత్కరించారు. రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ నారాయణ భట్టు మాట్లాడుతూ సాంఘీక అసమానతలు దాటుకుని ఇతరులకు మార్గదర్శకంగా నిలిచిన మహిళలను గుర్తించి గౌరవించు కుంటే మరి కొందరికి మార్గ దర్శకులు అవుతారని అన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి ఎండి సాదిక్, మహిళా క్రాంతి పథం ఎపిఎం దగ్గుపాటి సురేష్, గోపీ కృష్ణ పాల్గొన్నారు .

➡️