రేపు తెలంగాణలో వైన్‌ షాపులు మూసివేత..

Dec 2,2023 15:08 #Telangana, #wines

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు తెలంగాణ వ్యాప్తంగా వైన్‌ షాపులు మూసివేయాలని ఆదేశించింది. ఆదివారం ఉదయం 6 గంటల నుండి ఎల్లుండి (సోమవారం) ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్‌లు, క్లబ్‌లు బంద్‌ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లఘించేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చింది. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 49 చోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

➡️