ప్రజాశక్తి – నెల్లిమర్ల : సార్వత్రిక ఎన్నికల్లో వైసిపిని మరోసారి గెలిపించి మరింత అభివృద్ధికి సహకరించాలని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పల నాయుడు అన్నారు. గురువారం మండలంలోని ఒమ్మి, నగర పంచాయతీ పరిధి గాంధీ నగర్ కాలనీలో ఎమ్మెల్సీ సురేష్బాబుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సంద ర్భంగా వారు ఇంటింటికి వెళ్లి మరింత అభివృద్ధికి ఎన్నికల్లో వైసిపి ఎమ్మెల్యేగా తనను, ఎమ్పిగా బెల్లాన చంద్రశేఖర్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో ఎంపిపి అంబళ్ల సుధారాణి, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ళ శ్రీరాములు నాయుడు, వైసిపి మండల అధ్యక్షులు చనమల్ల వెంకట రమణ, జడ్పిటిసి గదల సన్యాసి నాయుడు, వైస్ ఎంపిపి పతివాడ సత్య నారాయణ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డెరైక్టర్ రేగాన శ్రీనివాస రావు పాల్గొన్నారు.వైసిపి ఇంటింటి ప్రచారం డెంకాడ: త్వరలో జరగబోవు ఎన్నికల్లో వైసిపికి మరొకసారి అవకాశం ఇవ్వాలని ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవ రావు, జోనల్ టు ఐటీ విభాగం ఇంఛార్జి, ఎమ్మెల్యే తనయుడు మణిదీప్ ప్రజలను కోరారు. మండలంలోని మోపాడ గ్రామ ంలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పల నాయుడుకు, ఎమ్పి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్కు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బడ్డు కొండ రమేష్ నాయుడు, వైస్ సర్పంచ్ బంటు పల్లి సత్యమ నాయుడు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, పాల్గొన్నారు.