దళితవాడల అభివృద్ధికి కృషి చేస్తా

Mar 20,2024 11:47 #West Godavari District

ఎమ్మెల్యే మంతెన రామరాజు

ప్రజాశక్తి-ఉండి: తాను వచ్చే ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యే గా విజయం సాధిస్తే దళితవాడల అభివృద్ధికి కృషి చేస్తానని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. ఉండి మండలం మహదేవపట్నంలో గ్రామపార్టీ అధ్యక్షులు వనిమా శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెండోరోజు నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, ఇంటింటికీ రాంబాబు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కూటమి అభ్యర్థి, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, జనసేన నియోజకవర్గ ఇంఛార్జి జుత్తిగ నాగరాజు మాట్లాడుతూ కూటమి అధికారం చేపడితే దళిత వాడల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితవాడలలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఎస్సీలకు రావాల్సిన సంక్షేమ పథకాలు తొలగించి వారికి తీరని అన్యాయం చేశాడని మండిపడ్డారు తిరిగి కూటమి అధికారం చేపట్టిన తర్వాత దళితులకు రావలసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించి అన్ని విధాల వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు దళిత క్రైస్తవులను ఎస్సీలలో చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు అనంతరం గ్రామ పార్టీ అధ్యక్షులు వనిమా శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో తెలుగుదేశం పార్టీకి మహదేవపట్నం గ్రామం కంచుకోట అని గత సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థికి పూర్తి మెజారిటీ ఇచ్చి గెలిపించారని అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి గ్రామం నుంచి భారీ మెజార్టీ అందించాలని ఆయన కోరారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో భారీ సంఖ్యలో దళితులు చేరగా వారికి ఎమ్మెల్యే మంతెన రామరాజు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️