ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

Apr 21,2024 12:45 #Department of Meteorology, #Report

అమరావతి : ఏపీలోని పలు జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి , విశాఖ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. కాగా నిన్న, మొన్నటి వరకు ఏపీలో పగటి పూట ఉష్ణోగ్రతలు సుమారుగా 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి.
మండే ఎండలకు తోడు వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జనాలు బయటకు వచ్చేందుకు సైతం భయంతో వణికిపోయారు. రాష్ట్రంలోని కడపలో 43 డిగ్రీలు, తిరుపతిలో 42.2, రాజమహేంద్రవరంలో 41 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయ్యింది . నెల్లూరు జిల్లాలో 40.3, తాడేపల్లిగూడెంలో 40.2, విజయవాడ, అనంతపురంలో 40, శ్రీకాకుళంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

➡️