వాకింగ్ చేస్తూ ప్రచారం

Mar 21,2024 13:56 #Nellore District

ప్రజాశక్తి – కావలి : గురువారం కావలి పట్టణంలో స్థానిక విట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉన్న మున్సిపల్ మినీ స్టేడియంలో ఎంపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు స్టేడియం ట్రాక్ లో వాకింగ్ చేస్తూ అందర్నీ మైమరిపించారు. ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ కావలి నియోజకవర్గం సంబంధించి నాలుగు ప్రత్యేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం, మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని, గతప్రభుత్వ హయాంలో అర్థంతరంగా ఆగి పోయిన దగదర్తి ఎయిర్ పోర్ట్, ముసునూరు నుండి ఉదయగిరి రోడ్డుకి బైపాస్ రోడ్, కావలి రైల్వే స్టేషన్లో లిఫ్ట్ సౌకర్యం, ఆధునికరణ, బిట్రగుంట రైల్వే స్టేషన్ లో పనులు రాబోయే వైసిపి ప్రభుత్వంలో తప్పకుండా వాటిని పూర్తిచేసి, కావలి అభివృద్ధికి తమ వంతు తోడ్పడుతామని అన్నారు. రాబోయేది మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని, మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కావలిలో వైసిపి జెండా ఎగరేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయన వెంట నాయకులు గాదం శెట్టి వేణు గోపాల్, నగళ్ళ శ్రీనివాస్ కిరణ్, షేక్. చెన్నయ్య, చెనికల ప్రసాద్,వాకర్లు, తదితరులు పాల్గొన్నారు.

➡️