విఆర్‌ఒ శ్రీరాములు నాయుడు మృతి

Apr 5,2024 21:23

ప్రజాశక్తి – సాలూరు : మండలం లోని పట్టణం, పలు గ్రామాలకు చెందిన విఆర్‌ఒ గోర్జి శ్రీరాములు నాయుడు (56) గురువారం రాత్రి మృతి చెందారు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో విజయనగరంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. గతంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. పాచిపెంట, రామభద్రపురం, సాలూరు మండలాల్లో పని చేశారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. శ్రీరాములునాయుడు మృతికి మండల తహశీల్దార్‌ ఎ.సింహాచలం, కార్యాలయం సిబ్బంది, విఆర్‌ఒలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. డిప్యూటీ సిఎం రాజన్నదొర, వైసిపి నాయకులు ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.

➡️