గ్రామ వాలంటీర్లు రాజీనామా

Apr 8,2024 16:35 #Kurnool

ప్రజాశక్తి-తుగ్గలి : మండల కేంద్రమైన తుగ్గలి సచివాలయంలో పనిచేస్తున్న 18 మంది వాలంటీర్లు, గిరిగేట్ల సచివాలయంలో పనిచేస్తున్న 5 మంది వాలంటీర్లు సోమవారము రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపీడీవో విజయలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా రాజీనామా చేసిన గ్రామ వాలంటీర్లు మాట్లాడుతూ జగనన్నను రెండవసారి ముఖ్యమంత్రిగా చేయడం, అలాగే పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవిను కూడా రెండోసారి ఎమ్మెల్యేగా చేయడమే తమ ధ్యేయమని వారు అన్నారు. జగనన్న పేద ప్రజల కోసం అందించిన సంక్షేమ పథకాలను గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేస్తామని వారు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మొదటి సంతకం వాలంటీర్ల నియామకంపై చేస్తానని ప్రకటిస్తామని చెప్పడం హర్షించ తగ్గ విషయం అన్నారు.

➡️