గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

Dec 2,2023 14:19 #dead body, #Kadapa
unknown dead body

ప్రజాశక్తి-కొండాపురం : మండలంలోని గండికోట ప్రాజెక్టు వెనుక జలాలలో గుర్తుతెలియని మహిళ మృతదేహం శనివారం లభ్యమయింది. కొండాపురం ఎస్సై యోగేంద్ర తెలిపిన వివరాల మేరకు కొండాపురం మండలంలోని జాతీయ రహదారి ప్రక్కన శ్రీ లక్ష్మీ నరసింహ గోడౌన్ ఎదురుగా రైల్వే బ్రిడ్జి ప్రక్కన ఉన్న నీటిలో శనివారం ఉదయం మహిళా మృతదేహం లభ్యమైనట్లు, ఈమె ఎర్రని రంగు బ్లౌజ్ ధరించింది. వివరాలు తెలియరాలేదని వివరాలు తెలిసినవారు కొండాపురం పోలీసులను సంప్రదించాలని ఎస్సై యోగేంద్ర తెలిపారు.

➡️