ఏకగ్రీవంగా బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా సీనియర్‌ న్యాయవాది ఎన్‌ ద్వారకానాథ్‌రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌గా ఎస్‌ కృష్ణమోహన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బార్‌ కౌన్సిల్‌ మెంబర్స్‌ అంతా వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా ఉన్న గంటా రామారావు, వైస్‌ ఛైర్మన్‌ కె రామజోగేశ్వరరావు ఇటీవల తమ పదవులకు రాజీనామా చేయడంతో వీరి ఎన్నిక జరిగింది. శుక్రవారం చివరి రోజునాటికి ద్వారకానాథ్‌రెడ్డి ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయన ఎన్నికను బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు ఆలూరు రామిరెడ్డి ప్రకటించారు. జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసే వ్యక్తి బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా ఎన్నిక కావడం ఇదే తొలిసారి. వైస్‌ ఛైర్మన్‌గా విశాఖపట్నంకు చెందిన ఎస్‌ కృష్ణమోహన్‌ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

➡️