ఒలింపిక్స్‌కు మరో రెండు బెర్త్‌లు

Jan 9,2024 08:33 #Air Pistol Team, #Sports
  • షూటింగ్‌లో 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ టీం, మిక్స్‌డ్‌ విభాగం
  • ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో స్వర్ణం

జకార్తా: భారత షూటర్లకు మరో రెండు ఒలింపిక్‌ బెర్త్‌లు దక్కాయి. 10మీ. పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ టీం, మిక్స్‌డ్‌ విభాగాల్లో భారత్‌కు ఒలింపిక్స్‌కు బెర్త్‌లు ఖరారయ్యాయి. శనివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో తోమర్‌, అర్జున్‌ సింగ్‌ చీమా, ఉజ్వల్‌ మాలిక్‌లతో కూడిన బృందం పసిడి పతకం కొల్లగొట్టింది. వరుణ్‌ (586), అర్జున్‌(579), ఉజ్వల్‌ (575)లు 1,740 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ఈ విభాగంలో ఇరాన్‌, కొరియా షూటర్లు రజత, కాంస్య పతకాలను సాధించారు. దాంతో భారత్‌ నుంచి షూటింగ్‌ విభాగంలో పారిస్‌ ఒలింపిక్‌ బెర్తు దక్కించుకున్న 14వ షూటర్ల బృందంగా తోమర్‌ బృందం నిలిచింది. అలాగే వరణ్‌ తోమర్‌, ఈషా సింగ్‌లు 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. ఈ జంట 15వ భారత షూటర్ల బృందంగా నిలిచారు. ఈ విభాగంలో పాకిస్తాన్‌కు రజత పతకం దక్కింది.

➡️