‘ఫహద్ ఫాజిల్’ ప్రధాన పాత్రలో రెండు ప్రాజెక్టులు తెరకెక్కుతున్నాయి. ఎస్.ఎస్.రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా ఈ కొత్త సినిమాలను ప్రకటించింది. మంగళవారం ఈ సినిమాలకు సంబంధించిన టైటిల్స్తో పాటు, పోస్టర్లను కూడా షేర్ చేశారు. ‘ఆక్సిజన్’ పేరుతో రూపొందబోయే సినిమాకు సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ఆసక్తికర కథతో ఈ మూవీ రాబోతోంది. శోభ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, కార్తికేయలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే శశాంక్ యేలేటి దర్శకత్వంలో పట్టాలెక్కనున్న మరో చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఫన్, థ్రిల్, ఎమోషన్స్తో కూడిన కథగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. జూన్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.