గిరిజనుల ఆందోళన

Apr 12,2024 00:15
నినాదాలు చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి-అనంతగిరి:తమ గ్రామాలకు రోడ్డు, తాగునీటి వంటి సౌకర్యాలు కల్పించాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు. టీడీపీ, వైసీపీ పార్టీలకు ఓట్లు వేసి మోస పోయామని గుమ్మ పంచాయతీ ఫోర్లు, కరకవలస, కొత్తూరు పంచాయతీ బూసిపాడు, టెంకెబుడ్డి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం బూసిపాడును సందర్శించిన సీపీఎం నాయకులు వంతల బుద్రయ్యతో కలిసి గిరిజనులు కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాదల చిన్నరావు, పట్టం భీమయ్య, బోయిన అప్పారావు మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ గ్రామాలకు రోడ్డు, తాగునీటి తదితర సౌకర్యాలు కల్పిస్తామని కచ్చితమైన హామీ ఇచ్చిన వారికే ఓట్లు వేస్తామని తెలిపారు. తమ కోసం పోరాటం చేసే పార్టీకే మద్దతు అని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీల నేతలు వస్తున్నారని, గెలిచిన తర్వాత తమ గ్రామాలను కనీసం పటించుకున్న నాదుడే కరువుయ్యరని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

➡️