అనకొండాల స్మగ్లింగ్‌.. బెంగళూరులో పట్టుబడ్డ ప్రయాణికుడు!

బెంగళూరు : అనకొండాలను స్మగ్లింగ్‌ చేయబోతూ ఓ ప్రయాణికుడు కస్టమ్స్‌ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ విమాన ప్యాసింజర్‌ బ్యాగేజీని తనిఖీ చేయగా అందులో ఏకంగా 10 పసుపు రంగు అనకొండాలు బయటపడ్డాయి. ఓ సూట్‌ కేసును తెరవగా అందులో తెల్ల కవర్లలో చుట్టిన అనకొండాలు కనిపించాయి.దీంతో నిందితుడిని అరెస్టు చేశామని.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని కస్టమ్స్‌ అధికారులు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ఈ ఘటనలో స్వాధీనం చేసుకున్న అనకొండాల ఫొటోలను షేర్‌ చేశారు. వన్యప్రాణుల స్మగ్లింగ్‌ ను ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

➡️