మిలాన్‌ విన్యాసాలకు పటిష్ట ఏర్పాట్లు

Jan 11,2024 09:24 #Navy, #visakhapatnam

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ: ఇండియన్‌ నేవీ మల్టీ నేషనల్‌ నావల్‌ ఎక్సర్‌సైజ్‌ మిలాన్‌ 2024ను విశాఖపట్నంలో ఫిబ్రవరి 19-27 మధ్య నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. గతంలో 11వ ఎడిషన్‌ను కూడా విశాఖలోనే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌ బాధ్యతాయుతమైన సముద్ర శక్తిగా మరింత ఎత్తుకు ఎదిగేందుకు, సముద్ర భద్రతను మరింత మెరుగుపరుచుకోవడానికి ఈ విన్యాసాలు తోడ్పడతాయని నేవీ అధికారులు భావిస్తున్నారు.

➡️