రైతు బజారులో దొంగలు హల్‌ చల్‌ – సీసీ కెమెరాలు పెట్టండయ్యా..!

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : చల్లపల్లి గ్రామపంచాయతీలోని రైతు బజార్‌ లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. శనివారం ఉదయం వినియోగదారులు తమ గోడును ప్రజాశక్తితో వెళ్లబోసుకున్నారు. రైతు బజార్లో సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం కూరగాయలు కొనడానికి వచ్చే వినియోగదారులు సీసీ కెమెరాలు లేక ఒకరి బైక్‌ను వేరొకరు తీసుకెళ్లిపోతున్నారు. రైతు బజార్‌ నుంచి సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు నిర్వహణపై ప్రత్యేకంగా విజ్ఞప్తులు ఉన్నాయి. వారాంతరపు రోజుల్లో సెల్‌ ఫోన్లు, పర్సులు పోతున్నాయని బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదుదారుల పరిష్కారం కోసం సిసి టీవీ ఫుటేజ్‌ ని పోలీసులు అడుగుతున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ రైతు బజార్‌ యాజమాన్యానికి విన్నవించినా స్పందించడం లేదని వినియోగదారులు చెప్పడంతో పోలీస్‌ సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి చల్లపల్లి రైతు బజార్‌ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజల బైక్‌ లు, ఇతర సామాగ్రి పోకుండా చూడాలని స్థానిక ప్రజలు యాజమాన్యాన్ని కోరుతున్నారు

➡️