నార్పలలో సెల్ఫోన్ దుకాణంలో చోరీ

Apr 7,2024 09:59 #Anantapuram District

కిరాణా దుకాణం రెండు ఎరువుల గోడౌన్ల తాళాలు బద్దలు చేసిన దొంగలు

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రం అయిన నార్పలలో శనివారం రాత్రి గూగూడు రోడ్డులోని ఒక మొబైల్ సర్వీసింగ్ దుకాణం తాళాలు బద్దలు కొట్టి దుకాణంలోని సెల్ఫోన్లు, బ్లూటూత్లు తదితర వస్తువులు తీసుకెళ్లారు. అదేవిధంగా దుగుమరి రోడ్డులోని ఓ కిరాణా దుకాణం తాళాలు పగల కొట్టారు కిరాణా దుకాణానికి సెంటర్ లాక్ ఉండడంతో దుకాణం వెనకలే ఉన్నటువంటి రెండు ఎరువుల గోడౌన్ల తాళాలు పగలగొట్టారు. మెయిన్ రోడ్డు లోనే ఇలా దొంగలు దుకాణాలు పగలగొడుతున్నారంటే మారుమూల ప్రాంతాల్లో నివాసాలు ఉన్న వారి పరిస్థితి ఏమిటి అని పలువురు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సంఘటన స్థలాలను ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి పరిశీలించి బాధితులతో ఫిర్యాదు తీసుకున్నారు ఇది ఆకతాయిల పనే అయి ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఎవరూ భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదని ప్రతిరోజు రాత్రి సమయంలో నార్పల్లో పోలీసులు గస్తీ తిరుగుతున్నారని, మెయిన్ రోడ్డులో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తామన్నారు. దుకాణదారులు కూడా బాధ్యతగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 24 గంటల్లో దొంగలను పట్టుకుంటామని ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

➡️