మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్
జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
ఎన్నికలు స్వేచ్ఛయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ ఆడిటోరి యంలో ఎన్నికల సూక్ష్మ పరిశీలకులకు అవగాహన, శిక్షణా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ విధానాన్ని పరిశీలించే సమయంలో ఎలాంటి తప్పిదాలు, ఉల్లంఘనలు జరుగుతున్నట్టు గుర్తించినా తక్షణమే రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకుల దృష్టికి తీసుకురా వాలన్నారు. పోలింగ్ సమయానికి గంట ముందు మాక్ పోలింగ్ తప్పక నిర్వహించా లన్నారు. పోలింగ్ స్టేషన్లను పరిశీలించాల న్నారు. అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాల న్నారు. ఓటర్లు వరుస క్రమంలో వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మూకుమ్మడిగా పోలింగ్ కేంద్రానికి వస్తున్నట్టు గమనిస్తే తక్షణమే సమీపంలోని పోలీసులను అప్రమ త్తం చేయాలన్నారు. పోలింగ్ విధానాన్ని పరిశీలించిన మైక్రో అబ్జర్వర్లు వారికి ఇచ్చిన ఫార్మట్లోనే నివేదిక ఇవ్వాలని వివరించారు. పోలింగ్ కేంద్రంలో పోలింగ్ విధానాన్ని, ఇవిఎం, వివి ప్యాడ్లను వినియోగించే విధా నాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. మైక్రో అబ్జర్వర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఫారం-12 ద్వా రా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.హోమ్ ఓటింగ్ను వినియోగించుకోవాలివృద్ధులకు, వికలాంగులకు భారత ఎన్నికల సంఘం కల్పించిన హోమ్ ఓటింగ్ను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం అధిక అంగవైకల్యం (40 శాతం పైబడి) ఉన్న వారికి, 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసుకునేందుకు హోం ఓటింగ్ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటు హక్కు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. మే 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హోమ్ ఓటింగ్కు ఆసక్తి ఉన్న వారి నుంచి ఈ నెల 18 నుంచి 23 వరకు ఫారం-12డి దరఖాస్తులను సంబంధిత సిబ్బంది సేకరిస్తారని, వాటి ఆధారంగా హోమ్ ఓటింగ్ అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఫారం-12డిపై అవగాహనఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన 12డి విధానంపై నోడల్ అధికారులు ఐసిడిఎస్, మెప్మ పీడీలు అవగాహన కల్పించారు. 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వికలాంగులు, కోవిడ్ బాధితులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఉందన్నారు. మే 5 నుంచి 8 వరకు నాలుగు రోజుల పాటు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఓటింగ్ వేసే విధంగా దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు వెళ్లాలన్నారు. ఓటు వేసే సమయంలో అన్నివిధాలా సహకరించాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియను గోప్యంగా ఉంచాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో నోడల్ అధికారులు, సమన్వయకర్తలు బాలాజీ నాయక్, ఎం.కిరణ్కుమార్, శేషగిరిరావు, బి.శాంతిశ్రీ, ఎం.సూర్యకిరణ్ పాల్గొన్నారు.