కలగానే మిగిలిన ఇంటి కల

Mar 16,2024 11:30 #Anantapuram District

అర్హుల్లైన నిరుపేదలు ఎన్ని సార్లు అధికారులకు అర్జీలు ఇచ్చిన ఫలితం శూన్యం 
ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రం అయిన నార్పలలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పేరుతో ప్రవేశపెట్టిన పథకంలో ఇళ్ల నిర్మాణాలు అడుగు ముందుకు పడటం లేదు. వాస్తవ పరిస్థితి చూస్తే మంజూరైన ఇళ్లలో పట్టుమని పదిశాతం కూడా ఇంత వరకు పూర్తికాలేదు. నవరత్నాలు-పేదలకు ఇళ్లు అంటూ ఊదరగొట్టే వైసీపీ పాలకులు క్షేత్రస్థాయిలో పథకాల ఫలితాలను ప్రజలకు చేర్చడంలో విఫలమయ్యారు. అధికారులు, నేతల నిర్లక్ష్యం లబ్ధిదారులకు శాపంగా మారింది. ప్రధానంగా ఇంటి స్థలం, అందులోనే పక్కాగృహ నిర్మాణం అంటూ ఆర్భాటం చేసి అమలు విషయంలో చేతులెత్తేశారు. ఇక్కడ అధికారులు మారడం తప్ప అర్హులకు ఇంటి పట్టాలు అందడం లేదు. ఎవరు గెల్చిన మన బతుకులు ఇంతే అని పలువురు నిరుపేద అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️