కక్ష సాధింపుతోనే ఏలూరిపై కేసు

Feb 2,2024 22:33

ప్రజాశక్తి – బాపట్ల
కక్ష సాధింపులతోనే టిడిపి జిల్లా అధ్యక్షులు, పర్చూరు ఎంఎల్‌ఎ ఏలూరు సాంబశివరావుపై అక్రమ కేసులు బనయించారని టిడిపి ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ ప్రకటనలో ఆరోపించారు. సాంబశివరావుకు సంబంధం లేని కంపెనీలో ఆధారాలు లేకుండా అక్రమంగా చేసి పెట్టారని అన్నారు. పర్చూరు నియోజకవర్గంలో దొంగ ఓట్లును బయట పెట్టిన వ్యక్తిపై కావాలని కక్ష పెట్టుకొని ఇలా చేశారన్నారు. రానున్న ఎన్నికలో వైసీపీ ఓడిపోతుందనే భయంతోనే సాంబశివరావుపై అక్రమ కేసు పెట్టారన్నారు. ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెపుతారని అన్నారు.

➡️