ప్రజాశక్తి-దువ్వూరు(కడప) : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన దువ్వూరు మండల పరిధిలోని కానగూడురు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తోట సుధాకర్ (35) కౌలుకు పొలాన్ని తీసుకుని వ్యవసాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో వ్యవసాయంలో నష్టం వచ్చినంది.. దీంతో అప్పుల బాధలు తట్టుకోలేక ఇంటిలోని ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తండ్రి సుబ్బారాయుడు ఇచ్చిన పిర్యాదు మేరకు దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభ్తుత్వాసుపత్రికి తరలించారు.