జాతీయ టెన్నిస్‌ పోటీల్లో ప్రతిభ

Apr 20,2024 20:46

 ప్రజాశక్తి- విజయనగరం టౌన్‌ : ఈనెల 17 నుంచి బెంగుళూర్‌లో ఎఐఎస్‌టిఎ నిర్వహిస్తోన్న అలిండియా సీనియర్స్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌ షిప్‌ 65వ విభాగంలో విజయనగరానికి చెందిన పి.సన్యాసిరాజు విజయకేతనం ఎగురవేశారు. సింగిల్స్‌లో ద్వితీయ స్థానం, డబుల్స్‌లో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. సన్యాసిరాజు విజయం విజయనగర జిల్లా టెన్నిస్‌ క్రీడాకారుల విజయమని టెన్నిస్‌ అసోసియేషన్‌ అభినందించింది. సన్యాసిరాజు ఎస్‌బిఐ ఉద్యోగిగా పదవీవిరమణ చేసి చింతలవలస క్రికెట్‌ అకాడమీకి సేవలు అందిస్తున్నారు. రంజీ మాజీ ప్లేయర్‌ సన్యాసిరాజు టెన్నిస్‌లో జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించారు. నేటికీ జాతీయ స్థాయిలో విజయనగరం క్రీడా ఖ్యాతి చాటుతున్నారని ఆఫీసర్స్‌ క్లబ్‌ టెన్నిస్‌ క్రీడాకారులు అభినందించారు.

➡️