- ఎన్నికల సంఘానికి వైసిపి ఫిర్యాదు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సిఎం జగన్పై వ్యక్తిగతంగా, వైసిపిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణ, యూట్యూబ్ ద్వారా పాటలు ప్రసారం చేస్తున్న నారా లోకేష్పై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్ చేసింది. ఈ మేరకు వైసిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్బాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డి బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.