బోరును స్వాధీనం చేసుకోండి

Mar 20,2024 12:38 #Anantapuram District

ఆక్రమణకు గురైన బోరుకై వామపక్ష నాయకుల డిమాండ్

ప్రజాశక్తి-నార్పల  : మండల పరిధిలోని జంగం రెడ్డిపల్లి గ్రామంలో శివయ సాగులో గ్రామ ప్రజల తాగునీటి సౌకర్యార్థం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వేసిన బోరును పక్కనే ఉన్నటువంటి రైతు బోరును ఆ స్థలాన్ని తన పొలంలో కలుపుకున్నాడని ఆక్రమణకు గురైన బోరును తిరిగి స్వాధీనం చేసుకొని ప్రజల సౌకర్యార్థం ఉపయోగించుకొని గ్రామంలో నీటి ఎద్దడిని నివారించాలని కోరుతూ బుధవారం సిపిఎం మండల కార్యదర్శి కుల్లాయప్ప సిపిఐ మండల కార్యదర్శి గంగాధర ఆధ్వర్యంలో తాసిల్దార్ నారాయణస్వామి ఎంపీడీవో రాముడుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్ డి శైలజారాణి వామపక్ష నాయకులు పెద్దపెద్దయ్య సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

➡️