టొరంటో : భారత సంతతికి చెందిన దంపతులు, వారి కుమార్తె కెనడాలోని అంటారియో ప్రావిన్స్లో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. రాజీవ్ వారికూ (51), అతని భార్య శిల్పా కోతా (47), కుమార్తె మహేక్ వారికూ (16) మరణించారు. ఈ ఘటన ఈ నెల 7న జరగగా.. మతదేహాలను శుక్రవారం గుర్తించారు. ఇంట్లో అగ్నిప్రమాదం వల్లే మరణించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే తదుపరి విచారణలో అనుమానాస్పదంగా మరణించినట్లు తేలింది. ఇంట్లో నుంచి భారీ పేలుడు శబ్దం వినిపించిందని ఇరుగుపొరుగు వారు తెలిపారు. రాజీవ్ వారికూ 2016 వరకు టొరంటో పోలీస్లో వాలంటీర్గా ఉన్నారు. మహేక్ ఒక ఫుట్బాల్ క్రీడాకారిణి.