కంప్యూటరైజేషన్‌కు చర్యలు చేపట్టాం..

Apr 6,2024 22:04
ఫొటో : మాట్లాడుతున్న జిల్లా కోపరేటివ్‌ ఆడిట్‌ అధికారి తిరుపతయ్య

ఫొటో : మాట్లాడుతున్న జిల్లా కోపరేటివ్‌ ఆడిట్‌ అధికారి తిరుపతయ్య
కంప్యూటరైజేషన్‌కు చర్యలు చేపట్టాం..
ప్రజాశక్తి-ఉదయగిరిసొసైటీ బ్యాంకులో కంప్యూటరైజేషన్‌కు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కోపరేటివ్‌ ఆడిట్‌ అధికారి తిరుపతయ్య పేర్కొన్నారు. శనివారం స్థానిక పట్టణంలోని కొట్టాలపల్లి సొసైటీ కార్యాలయంలో ఆయన సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆడిటింగ్‌ సంబంధించిన పలు రికార్డులు రిజిష్టర్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి సబ్‌ డివిజన్‌ పరిధిలో 8 సొసైటీ బ్యాంకులు కంప్యూటరైజేషన్‌ చేపట్టామన్నారు. నేటి నుండి మన బ్యాంకులో ఈ సౌకర్యం ఉంటుందని ఈ అవకాశాన్ని వినియోగదర్లు గుర్తించాలన్నారు.

➡️