మహనీయుల విగ్రహాలు ఆవిష్కరణ

Mar 17,2024 00:52

ప్రజాశక్తి – రేపల్లె
దేశ ఔన్నత్యాన్ని చాటిన మహనీయులను స్మరిస్తూ విగ్రహాలను పట్టణంలో ఏర్పాటు చేయటం అభినందనీయమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు అన్నారు. పట్టణంలోని ఓల్డ్ టౌన్ అంకమ్మ చెట్టు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ గాంధీజీ, ముఖ్యమంత్రి డాక్టర్‌ కొణిజేటి రోశయ్య, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయులు చేసిన త్యాగాలను భావితరాలకు తెలియజేసేందుకే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహనీయుల ఆశయ సాధనకు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. మహనీయుల ఆశయాలు, ఆలోచనలే పునాదిగా వైసీపీ ఆవిర్భవించిందని అన్నారు. రానున్న ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. ఈ యుద్ధంలో సీఎం జగన్‌ పక్షాన ప్రజలే పోరుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండమ్మా అని అడిగే ధైర్యం రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌కు తప్ప మరెవ్వరికి లేదన్నారు. కార్యక్రమంలో బుడా చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, వైసిపి ఇన్‌చార్జి డాక్టర్ ఈపూరి గణేష్, మున్సిపల్‌ చైర్మన్ కట్టా మంగా, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాథ గుప్తా పాల్గొన్నారు.

➡️