-ఒక్కరోజులో 21,574 కేసుల పరిష్కారం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని స్టేట్ లీగల్ సెల్ అథారిటీ తెలిపింది. 16,807 పెండింగ్ కేసులతోపాటు 4,767 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయని ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన 386 లోక్ అదాలత్ బెంచ్లు ఆయా కేసులను విచారించి, పరిష్కరించాయని వివరించింది. ఆయా కేసులకు సంబంధించి రూ.74.05 కోట్లు సెటిల్మెంట్ చేసినట్లు తెలిపింది. న్యాయమూర్తులు టి.రాజశేఖరరావు, వి.గోపాలకృష్ణారావు ఆధ్వర్యాన హైకోర్టులో రెండు బెంచ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. మొత్తంగా హైకోర్టులో 137 కేసులు పరిష్కారమయ్యాయని, రూ.2.85 కోట్లు సెటిల్మెంట్ చేశారని తెలిపింది.