కాంగ్రెస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం : కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు గంటా అంజిబాబు

Mar 18,2024 01:33

ప్రజాశక్తి – చీరాల
అధికార వైసీపీ, టిడిపి కూటమి ప్రజా సంక్షేమాన్ని పక్కన బెట్టి సీఎం కుర్చీ కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అభివృద్ధిని వదిలేశారని, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు గంటా అంజిబాబు అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చీరాల అసెంబ్లీ నుండి కాంగ్రెస్ ఎవరిని నిలబెట్టినప్పటికీ అందరూ కలిసి సమన్వయంతో పని చేయవలసి ఉంటుందని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య మునగడకే ప్రమాదం వచ్చిందని అన్నారు. మనం అందరం కష్టపడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవలని అన్నారు. బాపట్ల పార్లమెంట్ స్థాయిలో అన్నీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. కాంగ్రెస్ అంటేనే ఒక కుటుంబం లా అందర్నీ సమన్వయం చేసుకుంటూ అభ్యర్థుల ఆలోచనలు తెలుసుకొని ముందుకు పోతుందని అన్నారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రజలందరూ పార్టీకి కృషి చెయ్యాలని అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌కు విజయావకాశాలు రావాలన్నారు. రాబోయే ఎన్నికల్లో చీరాలలో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సయ్యద్‌ ఆలింబాబు, పిసిసి ప్రధాన కార్యదర్శి కరెద్దుల సురేష్, బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి గుత్తి ధనుంజయ, జిల్లా కార్యదర్శి ఎస్‌కె రహిమతుల్లా, పిసిసి మైనార్టీ సెల్ కార్యదర్శి కెవి ప్రసాదరావు, జిల్లా ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ దేవరకొండ కోటేశ్వరరావు,
జిల్లా ఎస్‌సి సెల్ సెక్రెటరీ నీలం మోజేష్, ఎన్ రామరాజు, ఎన్ఎస్ఎస్ లక్ష్మి జ్యోతి, చంద్రశేఖరరావు, పఠాన్ రాజేష్, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి దామర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️