స్టేజ్‌ కూలి ఒకరు మృతి – 17మందికి గాయాలు

Jan 28,2024 11:26 #17, #injured, #New Delhi, #Stage

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో జరిగిన ‘జాగరణ’ కార్యక్రమంలో అకస్మాత్తుగా వేదిక కూలిపోయింది. ఈ ఘటనలో ఒక మహిళ మఅతి చెందగా, 17 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో దాదాపు 1,600 మంది ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. గాయడిన 17 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి 1:20 గంటలకు జరిగినట్లు తెలుస్తుంది. ‘జాగరణ’ నిర్వాహకులపై పోలీసులు ఐపిసి సెక్షన్‌ 337/304A/188 కింద కేసులు నమోదు చేశారు.

➡️