శ్రీవారి హుండీ ఆదాయం 5.5కోట్లు

Feb 27,2024 08:16 #tirumala tirupathi temple, #ttd

ప్రజాశక్తి -తిరుమల : తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. 2024 ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం రోజున తిరుమల హుండీకి రూ. 5.09 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేటస్థానం వెల్లడించింది. తిరుమలకు దేవస్థానానికి ఇంత ఆదాయం రావడం ఈ నెలలో రెండోసారి కావడం విశేషం. స్వామి వారిని 76,577 మంది సందర్శకులు దర్శించుకున్నారు. 23,656 మంది తలనీలాలు సమర్పించారు. సర్వ దర్శనం టోకెన్లు లేని సందర్శకులు దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

➡️