ఛిట్టోగ్రామ్(బంగ్లాదేశ్): బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో శ్రీలంక టాపార్డర్ బ్యాటర్స్ రాణించారు. మధుశంక(57), కరుణరత్నే(86), కుశాల్ మెండీస్(93) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలిగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4వికెట్ల నష్టానికి 314పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ అంగోలా మాథ్యూస్(23) నిరాశపరిచినా.. ఛండీమాల్(34), ధనుంజయ(15) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లు హసన్ మహమూద్కు రెండు, షకీబ్కు ఒక వికెట్ దక్కాయి.