ప్రజాశక్తి-కోట : కోట మండలం విద్యానగర్ పరిసర ప్రాంతాల్లో జనావాసాల్లోకి అకస్మాత్తుగా చుక్కల దుప్పి రావడం జరిగింది.తరచుగా ప్రతి ఏడాది ఎండాకాలంలో చుక్కల దుప్పిలు జనవాసాల్లోకి రావడం సహజం. అయితే సోమవారం పాట మండలంలోని బాల భారతి స్కూల్ ఎదురుగా ఓ వీధిలో చుక్కల దుప్పి ప్రత్యక్షమవడంతో దానిని కాసేపు కుక్కలు వెంటాడడం జరిగింది.దీనితో చుక్కల దుప్పికి కొద్దిపాటి గాయాలు అవ్వడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి ప్రధమ చికిత్స కొరకు తీసుకెళ్లడం జరిగింది. తక్షణమే స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం అనంతరం తదితర అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అటవీశాఖ అధికారులు తెలియజేశారు.