గృహనిర్మాణంపై స్పెషల్‌ డ్రైవ్‌

Dec 2,2023 01:07

ప్రజాశక్తి – నగరం
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గృహనిర్మాణ శాఖ సిబ్బంది, సచివాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణలో ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య మాట్లాడుతూ డిసెంబర్ 1నుంచి స్పెషల్ మెగా డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. మండలంలో మంజూరైన ఇల్లు నిర్మించుకునే వారందరికీ అవగాహన కల్పించాలని అన్నారు. హౌసింగ్ డిఇ మాట్లాడుతూ మండలంలో ఇప్పటికీ 618ఇల్లు మంజూరైనట్లు తెలిపారు. వాటిలో 100ఇల్లు వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సైదా నాయక్, తహశీల్దారు ప్రమీల, హౌసింగ్ డిఇ సుబ్బారావు, ఎంపీడీఒ చక్రపాణి ప్రసాద్ పాల్గొన్నారు.

➡️