జహన్నెస్బర్గ్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే దక్షిణాఫ్రికా జట్టును ఆ దేశ క్రికెట్బోర్డు ప్రకటించింది. బోర్డు ప్రకటించిన 14మంది ఆటగాళ్లకు నీల్ బ్రాండ్ నాయకత్వం వహించనున్నాడు. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో టి20 లీగ్ జరుగుతుండడమే ఇందుకు కారణం. న్యూజిలాండ్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో డేవిడ్ బెడింగ్హమ్, జుబేర్ హంజా, డ్యుయన్ ఒలివియర్, కీగన్ పీటర్సన్, ఖాయా జోండో మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. న్యూజిలాండ్ పర్యటనలో ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు మౌంట్మాంగనూరులో తొలి టెస్ట్.. ఫిబ్రవరి 13నుంచి 17వరకు హ్యామిల్టన్లో రెండో టెస్ట్ జరగనుంది.
జట్టు: నీల్ బ్రాండ్(కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, రువాన్ డి స్వర్డ్ట్, క్లైడ్ ఫోర్టుయిన్, జుబేర్ హంజా, త్షెపో మోరేకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, డ్యుయన్ ఒలివియర్, డేన్ ప్యాటర్సన్, కీగన్ పీటర్సన్, డేన్ పీడ్ట్, రేనార్డ్ వాన్ టోండర్, షాన్ వాన్ బెర్గ్, ఖాయా జోండో.